పంజాబ్తో మ్యాచ్లో ఢిల్లీ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా KL రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగి.. 152* పరుగుల భారీ సెంచరీతో విరుచుకుపడ్డాడు. మరోవైపు నితీష్ రాణా తృటిలో సెంచరీని చేజార్చుకున్నప్పటికీ, 91 పరుగులతో అదరగొట్టాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు 220 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో DC.. 264/2 పరుగుల భారీ స్కోరు చేసింది.