పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో KL రాహుల్ మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. కేవలం 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో IPLలో తన 43వ అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్లో రాహుల్కు ఇది మూడో హాఫ్ సెంచరీ. కాగా, 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్ ఇచ్చిన సులువైన క్యాచ్ను జారవిడిచిన పంజాబ్.. ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటోంది.