• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

రంజీ ఫైనల్: పట్టు బిగిస్తున్న జమ్మూకశ్మీర్

రంజీ ట్రోఫీ ఫైనల్లో జమ్మూకశ్మీర్ బ్యాటర్లు దుమ్మురేపుతున్నారు. 284/2 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన J&K.. ఆట ముగిసే సమయానికి 527/6 పరుగుల భారీ స్కోరు సాధించింది. శుభమ్ (121) సెంచరీ చేయగా.. హసన్ (88), డోగ్రా (70), అబ్దుల్ సమద్ (61), కన్హయ్య (70), సాహిల్ (57*) అర్ధ సెంచరీలతో రాణించారు. బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు పడగొట్టాడు.

February 25, 2026 / 04:37 PM IST

జోస్ బట్లర్‌కు కెప్టెన్ బ్రూక్ మద్దతు

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ ఫామ్‌పై ప్రస్తుత కెప్టెన్ హ్యారీ బ్రూక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘బట్లర్ ఇంగ్లండ్ క్రికెట్‌కు ఎంతో కాలంగా సేవలు అందిస్తున్నాడు. కెప్టెన్‌గా T20 WCను కూడా అందించాడు. అతడి బ్యాటింగ్ సామర్థ్యంపై ఎవరికీ అనుమానాలు లేవు. అతడో పవర్ హౌస్. నాకౌట్ దశలో అతడి నుంచి భారీ ఇన్నింగ్స్ చూస్తారు’ అంటూ బ్రూక్ ధీమా వ్యక్తం చేశాడు.

February 25, 2026 / 04:35 PM IST

అభిషేక్‌కు పాక్ ప్లేయర్ నుంచి ముప్పు..!

టీమిండియాలోకి పునరాగమనం చేసిన తర్వాత ఇషాన్ కిషన్ దుమ్మురేపుతున్నాడు. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఇషాన్ కిషన్ మూడో స్థానానికి దూసుకెళ్లాడు. మరోవైపు, వరుసగా విఫలమవుతున్నప్పటికీ అభిషేక్ శర్మ తన అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. అయితే, పాక్ ప్లేయర్ ఫర్హాన్ నుంచి అభిషేక్ టాప్ ప్లేస్‌కు ముప్పు ఏర్పడింది. అతడు T20 WCలో తన ప్రదర్శనతో రెండో స్థానానికి దూసుకొచ్చాడు.

February 25, 2026 / 03:57 PM IST

ఆఫ్ఘనిస్థాన్ కొత్త హెడ్‌కోచ్‌ ఎవరంటే..?

ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు కొత్త హెడ్‌కోచ్‌గా ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ పైబస్ నియమితులయ్యాడు. కోచ్ జొనాథన్ ట్రాట్ కాంట్రాక్ట్ ముగియడంతో, అతడి స్థానంలో రిచర్డ్‌ను నియమించినట్లు ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు అధికారికంగా వెల్లడించింది. రిచర్డ్‌కు కోచ్‌గా మంచి రికార్డు ఉంది. అతడు 2013 నుంచి 2019 వరకు వెస్టిండీస్ జట్టుకు(కోచ్/డైరెక్టర్) సేవలందించాడు.

February 25, 2026 / 03:45 PM IST

ఆసియా జట్లు లేని సెమీస్..?

T20 WC చరిత్రలో ఆసియా జట్లు లేకుండా ఇప్పటివరకు సెమీఫైనల్స్ జరగలేదు. దాదాపు ప్రతి ఎడిషన్‌లోనూ రెండు ఆసియా జట్లు సెమీస్‌కు (2016, 2021ల్లో ఒక్కో జట్టు మాత్రమే) చేరుకున్నాయి. అయితే, ఈసారి సెమీస్ చేరుకోవడానికి భారత్, పాక్, శ్రీలంక తడబడుతున్నాయి. ఇంగ్లండ్ ఇప్పటికే సెమీస్ చేరుకోగా, మిగిలిన మూడు స్థానాల కోసం SA, WI, NZలతో ఆసియా జట్లకు భారీ పోటీ నెలకొంది.

February 25, 2026 / 03:23 PM IST

టీమిండియాకు గుడ్ న్యూస్

తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో నిన్న రింకూ సింగ్ నోయిడాకు వెళ్లాడు. దీంతో అతడు రేపటి జింబాబ్వే మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చని అంతా అనుకున్నారు. అయితే, రేపటి మ్యాచ్‌లో మిడిల్ ఆర్డర్‌లో రింకూ కీలకమని జట్టు యాజమాన్యం భావిస్తుంది. ఈ క్రమంలో అతడు చెన్నై చేరుకోవడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. దీంతో అతడు చెన్నైకి బయల్దేరినట్లు తెలుస్తోంది.

February 25, 2026 / 03:07 PM IST

టీమిండియాలో మార్పులు చేయాలి: రవిశాస్త్రి

టీమిండియాకు మాజీ కోచ్‌ రవిశాస్త్రి కీలక సూచనలు చేశాడు. జింబాబ్వేతో మ్యాచ్‌లో భారత్ తుది జట్టులో మార్పులు చేయాలని తెలిపాడు. అక్షర్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకోవాలన్నాడు. అలాగే, వాషింగ్టన్ సుందర్‌ను కూడా ఈ మ్యాచ్‌లో ఆడించాలని పేర్కొన్నాడు. దీంతో బ్యాటింగ్‌లో బలం పెరుగుతుందన్నాడు. ఫాస్ట్ బౌలర్లుగా బుమ్రా, పాండ్యా సరిపోతారని వ్యాఖ్యానించాడు.

February 25, 2026 / 02:27 PM IST

23 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు బంగ్లా జట్టు

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు 23 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. రెండు టెస్టుల ఈ సిరీస్ 2026-27 ఆసీస్ హోమ్ సీజన్‌కు ఆరంభం కానుంది. గతంలో 2017లో మీర్పూర్‌లో ఆసీస్‌ను ఓడించి బంగ్లా సంచలనం సృష్టించింది. సుదీర్ఘ విరామం తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై తలపడనుండటంతో ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

February 25, 2026 / 01:51 PM IST

టీమిండియా సెమీస్‌కు చేరాలంటే..?

T20 WC సెమీఫైనల్స్‌కు టీమిండియా అర్హత సాధించడంపై సందిగ్ధత నెలకొంది. భారత జట్టు రన్ రేట్ మైనస్‌లో ఉండటం ప్రధాన కారణం. సెమీస్‌కు చేరాలంటే రేపు జరగనున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ను ఓడించాలి. అలాగే వర్షం కూడా టీమిండియాకు అనుకూలంగా మారవచ్చు. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే.. భారత్ సెమీఫైనల్స్‌కు సులభంగా వెళ్తుంది.

February 25, 2026 / 12:29 PM IST

T20 WC: టీమిండియాకు శుభవార్త

T20 ప్రపంచ కప్ 2026 సూపర్-8లో భాగంగా టీమిండియా సెమీస్ అవకాశాలు కఠినంగా మారాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా రేపు భారత్, జింబాబ్వే మ్యాచ్ జరగనుంది. దీనికోసం తాజా పిచ్‌ను వినియోగించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని సమాచారం. దీంతో భారత్ భారీ స్కోర్ చేసే ఛాన్స్ ఉందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

February 25, 2026 / 11:50 AM IST

కోచ్‌పై స్టార్ క్రికెటర్ విమర్శలు

పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షాహీన్ అఫ్రిది కోచ్ మైక్ హెస్సన్‌పై పరోక్ష విమర్శలు చేశాడు. ‘నమీబియా మ్యాచ్‌లో నన్ను తొలగించారు. కానీ, నా దృష్టి నా బౌలింగ్‌పై పని చేయడం, తిరిగి ఎలా జట్టులోకి రావాలి అనేది ఆలోచించాను. నేను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నాకు అవకాశం వచ్చినప్పుడల్లా నేను వెళ్లి నా జట్టుకు 100 శాతం ఇస్తాను’ అని పేర్కొన్నాడు.

February 25, 2026 / 11:02 AM IST

T20 WC: సెమీస్‌కు చేరేది ఎవరు?

T20 WCలో సూపర్-8లో భాగంగా ఇవాళ శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. శ్రీలంక సెమీస్‌కు చేరాలంటే ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాల్సిందే. కాస్త తడబడతున్న శ్రీలంక జట్టు న్యూజిలాండ్ స్పిన్నర్ల ధాటికి తట్టుకుని నిలబడుతందా? అనేది వేచి చూడాలి. అలాగే వర్షం కారణంగా పాక్‌తో మ్యాచ్ రద్దయ్యి ఒక పాయింట్‌తో ఉన్న న్యూజిలాండ్‌కు కూడా ఈ మ్యాచ్ కీలకమే.

February 25, 2026 / 10:48 AM IST

శిఖర్ ధావన్‌కు బిగ్ రిలీఫ్

భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్‌కు ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు భారీ ఊరట లభించింది. భరణంగా ధావన్ ఇచ్చిన దాదాపు రూ. 5.72 కోట్ల తిరిగి ఇచ్చేయాలని ఆయన మాజీ భార్య ఆయేషా ముఖర్జీని కోర్టు ఆదేశించింది. ప్రాపర్టీ సెటిల్మెంట్ కింద ఆ మొత్తం చెల్లించాలని ఆస్ట్రేలియాలోని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. అది భారతీయ చట్టాలకు విరుద్ధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

February 25, 2026 / 10:30 AM IST

టీమిండియా ఓటమి సంతోషమే: రవిశాస్త్రి

T20 WCలో సౌతాఫ్రికాపై భారత్ భారీ తేడాతో ఓటమిపాలవడంపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. వరుస విజయాల తర్వాత ఇలాంటి ఓటమి ఎదురవడం సహజమని, ఇది జట్టుకు అలర్ట్ లాంటిదని అభిప్రాయపడ్డాడు. సెమీఫైనల్స్ వంటి కీలక స్టేజ్‌లో కాకుండా ఇప్పుడే ఓటమి ఎదురైనందుకు సంతోషిస్తున్నా అని అన్నాడు. ఈ ఓటమితో జట్టు తన గేమ్ ప్లానింగ్ చేసుకుని విజయం సాధించే ఛాన్స్ ఉంటుందని పేర్కొన్నాడు.

February 25, 2026 / 07:16 AM IST

T20 WC: నాలుగు* సెంచరీలు.. ఇదే తొలిసారి

ప్రస్తుత T20 వరల్డ్ కప్ రసవత్తరంగా సాగుతోంది. ఈ సారి టోర్నీలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆటగాళ్లు సెంచరీలతో రాణిస్తున్నారు. 2010, 2014, 2016 ఎడిషన్స్‌లో అత్యధికంగా రెండేసి సెంచరీలు నమోదు కాగా.. ప్రస్తుత టోర్నీలో ఇప్పటికే 4* నమోదయ్యాయి. ఇంకా 10 మ్యాచులు మిగిలి ఉండటంతో ఈ సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ లేకపోలేదు.

February 25, 2026 / 01:40 AM IST