CSK జట్టుపై సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్లో చెన్నై గెలిచిన 3 విజయాల్లో రెండు సంజూ శాంసన్ సెంచరీలు చేయడంతోనే గెలిచారని సెహ్వాగ్ గుర్తు చేశాడు. ఇలా కేవలం ఒక్క ప్లేయర్పైనే ఆధారపడితే CSK ప్లే ఆఫ్స్కు చేరడం కష్టమని అన్నాడు. ఒకవేళ సంజూ విఫలమైతే జట్టు మళ్లీ ఓటముల బాట పడుతుందని జోస్యం చెప్పాడు. ప్లేయర్లు అందరూ సమిష్టి ప్రదర్శన చేయాలని సూచించాడు.