గుజరాత్ జెయింట్స్ స్టార్ ప్లేయర్ జోస్ బట్లర్ అరుదైన రికార్డు సాధించాడు. RCBతో జరుగుతున్న మ్యాచ్లో బరిలోకి దిగడం ద్వారా బట్లర్ టీ20 క్రికెట్లో 500 మ్యాచుల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా ఇంగ్లండ్ తరఫున అలెక్స్ హేల్స్ (528 మ్యాచ్లు) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా బట్లర్ నిలిచాడు. ఓవరాల్గా ఈ ఘనత అందుకున్న 10వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.