ATP: కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ముమ్మరంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని జిల్లా YCP అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. ఇటీవల పార్టీ పదవులు పొందిన నాయకులు ఆయనను కలిసిన సందర్భంగా అనంత మాట్లాడారు. అందరూ సమష్టిగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.