VSP: హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చిన యువతి అంజలి జగదాంబ జంక్షన్లో బంధువుల ఇంటికి వెళ్లింది. అనంతరం తన వదినతో కలిసి ఆటోలో వేపగుంట ఫంక్షన్ హాల్కు వెళ్లే క్రమంలో ఆటోలో లగేజ్తో పాటు బంగారం ఉన్న బ్యాగును మరిచిపోయింది. పెందుర్తి క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై సూరిబాబు తన సిబ్బంది, సాంకేతిక పరిజ్ఞానంతో ఆటోను గుర్తించి, బాధితురాలికి తన వస్తువులను అప్పగిచారు.