కోనసీమ: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మొక్కజొన్న రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ కామన ప్రభాకరరావు ఆరోపించారు. సోమవారం మండపేటలో అయన మాట్లాడుతూ.. ప్రభుత్వం క్వింటాలుకు రూ.2400 మద్దతు ధర ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం మార్కెట్లో కేవలం రూ.1700 మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.