గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో మంగళవారం ప్రత్యేక మహిళా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుంచి మహిళలు పెద్ద ఎత్తున హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యే గళ్ళా మాధవి దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి, అర్హులైన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.