ATP: అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద డా.బీ.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి సాకే లక్ష్మీనరసింహ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి MLA దగ్గుపాటి ప్రసాద్ అతిథిగా హాజరై అన్నదానాన్ని ప్రారంభించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పేదలకు సేవ చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు.