SKLM: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కేంద్ర కార్యాలయం పై వైసీపీ నేతలు దాడి చేయడం హేయమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మీడియా స్వేచ్ఛను హరించే హక్కు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికీ లేదు. ధర్నాల పేరు తో వైసీపీ నేతలు గూండాలుగా వ్యవహరిస్తూ దాడులకు దిగుతున్నారు పేర్కొన్నారు.