E.G: వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనకై 1000 కిలోమీటర్ల సైకిల్ యాత్ర ఏప్రిల్ 6న తిరుపతి నుంచి ప్రారంభం అయ్యి 700 కిలోమీటర్లు పూర్తి చేసుకోని రాజమండ్రికి చేరుకుంది. ఈ మేరకు వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ఫౌండర్ విజయ్ కలాం శనివారం రాజమండ్రి సిటీ జనసేన ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణను కలిశారు. సైకిల్ యాత్ర చేస్తున్న బృందాన్ని అభినందించారు.