VZM: అరకులోయలో ఇవాళ ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. అలాగే, నేటి యువత అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలన్నారు.