SKLM: జిల్లాలో జర్నలిస్టుల అక్రిడేషన్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంత్రి కింజరాపు అచ్చెంనాయుడు కలెక్టర్ను ఆదేశించారు. శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో IFWJ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించగా, మంత్రి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అవసరమైతే రాష్ట్ర స్థాయిలో చర్చించి సమస్యను పరిష్కరిస్తానన్నారు.