KKD: గత ప్రభుత్వ హయాంలో విజయనగరం జిల్లా రామతీర్థంలో ధ్వంసమైన కోదండ రామస్వామి, సీతమ్మ, లక్ష్మణ స్వామి విగ్రహాలను వైఖానస ఆగమన ప్రకారం కోటిపల్లి గోదావరి నదిలో జలాధివాసం చేయనున్నారు. నిమజ్జనానికి బయలుదేరిన రథం అన్నవరం చేరుకోవడంతో ఎమ్మెల్యే సత్యప్రభ విగ్రహాలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వం ఆలయాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు.