PLD: ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక ఆర్సీఎం చర్చి ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది. జీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు ఈ శిబిరాన్ని సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. పల్లెల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు.