నంద్యాల: జిల్లాలో 1,00,686 మంది మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు శాఖల సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ రాజకుమారి ఇవాళ ఆదేశించారు. ప్రతి వాలంటీర్కు 10 మంది చొప్పున అనుసంధానం చేసి మే 28న జరిగే ప్రీ–ఫైనల్ పరీక్షకు వంద శాతం హాజరు కల్పించాలని ఆమె సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ వెల్లడించారు.