NDL: బేతంచర్ల మండలం సీతారామపురం మెట్ట వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. సంజీవ నగర్ కాలనీకి చెందిన కూలీలు చామంతి పూలు కోయడానికి ఆటోలో వెళ్తుండగా ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. డ్రైవర్ మధుకు తీవ్ర గాయాలు అవడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూల్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.