NTR: వీరులపాడు మండలం జుజ్జూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ డే వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎంఈవో విద్యార్థులు తయారు చేసిన నమూనాలను చూసి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వినూత్న ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలతో ముందడుగు వేయడం హర్షనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.