TPT: నాగలాపురం మండలం కొడియంబేడు వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై వైపు వెళ్తున్న కారు, లారీ వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. అయితే, కారులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.