GNTR: తెనాలిలోని జ్యువెలరీ షాపులో బుధవారం అర్ధరాత్రి భారీ దొంగతనం జరిగింది. దుండగులు షాపు తాళాలు ధ్వంసం చేసి లోనికి ప్రవేశించి,10 కేజీల వెండితో పాటు 10 గ్రాముల బంగారాన్ని దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో టూ టౌన్ సీఐ రాములు నాయక్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాల ఆధారంగా ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో ఈ చోరీకి పాల్పడ్డారు.