VSP: APSRTC రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు ద్వారకా బస్ స్టేషన్లో పరిశుభ్రత, మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ప్రయాణికులకు ఆహ్లాదకర వాతావరణం కోసం ఇండోర్ ప్లాంట్స్ పెంపొందిస్తున్నామని తెలిపారు. బెంచీలు, కుర్చీలను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీటీఎం కె.పద్మావతి, ఏటీఎం బాపిరాజు, ఏఎం ఎస్ఎస్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.