SKLM: కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచిందని పలాస మండలం బొడ్డపాడులోని ఉపాధి కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి త్వరగా పనులు కల్పించాలని వారు కోరుతున్నారు. ఈ మేరకు స్థానిక సచివాయల సిబ్బందికి ఏఐసీసీటీయూ నాయకులు కుత్తుం దుష్యంత్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధి కూలీలు ఉన్నారు.