GNTR: రాష్ట్రంలో దెబ్బతిన్న దేవాలయాల వ్యవస్థను తిరిగి నిర్మిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. గురువారం గుంటూరు బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక రంగాన్ని, టెంపుల్ టూరిజాన్ని బలోపేతం చేస్తామన్నారు. ఇదే క్రమంలో లిక్కర్ స్కామ్ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.