ATP: జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు పోలీసులు మైనర్ల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. స్థానిక పరేడ్ మైదానంలో అర్బన్ డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ చిన్నపిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపైనే చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రమాదాల వల్ల కలిగే ప్రాణ నష్టం, కుటుంబాలపై పడే ఆర్థిక భారం గురించి వివరించారు.