SKLM: శ్రీకాకుళంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పైడిశెట్టి జయంతి గురువారం ప్రకటన విడుదల చేశారు. అమరావతి రాజధాని బిల్లు ఆమోదం శుభ పరిణామమని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషితోనే సాధ్యమైందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలు అందించిన సహకారం గొప్పదన్నారు. ఈ బిల్లు ఆమోదానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.