ప్రకాశం: తర్లుపాడు మండలంలోని చెన్నారెడ్డి పల్లి నుంచి తుమ్మలచెరువు గ్రామానికి వెళ్లే రోడ్డుపై మంగళవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అయితే ఆత్మహత్య చేసుకున్నాడా లేదా అనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.