అన్నమయ్య: సదుం, సోమల మండలాల్లో ప్రధానమంత్రి గ్రామీణ రహదారి పథకం పనులను జిల్లా కలెక్టర్ నిశాంత్ ఆకస్మికంగా పరిశీలించారు. నిర్ణీత గడువులో నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా సదుం మండలం దిగువ గొల్లపల్లిలో రైతు సాగు చేస్తున్న చామంతి పూల తోటను పరిశీలించి, ఉద్యాన పంటల ద్వారా ఆదాయం పెంచుకోవాలని రైతులకు సూచించారు.