కృష్ణా: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణపై గుడివాడ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో వైసీపీ నేతలు గురువారం ఫిర్యాదు చేశారు. తమ పార్టీకి చెందిన మహిళా నేతలను, కార్యకర్తలను కించపరిచేలా కథనాలను ప్రసారం చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధాకృష్ణ తన పత్రిక వేదికగా వైసీపీ మహిళా నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.