సత్యసాయి: పరిగి మండలంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి వెళ్తున్న సందర్భంగా మనేసముద్రం గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న రైతు చౌడప్పకు చెందిన మల్బరీ తోటను మంత్రి సవిత శనివారం పరిశీలించారు. రైతుతో మాట్లాడి పంట దిగుబడి, పెట్టుబడి–రాబడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మల్బరీ సాగులో ఎదురవుతున్న సమస్యలను కూడా వివరంగా తెలుసుకున్నారు.