NDL: జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేసి, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని వివిధ ప్రాజెక్టుల ప్రతినిధులకు కలెక్టర్ రాజకుమారి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. రెన్యూవబుల్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణపై కలెక్టర్ సమీక్షించారు.