KRNL: పత్తికొండలో టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్యాం బాబు ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. హంద్రీనీవా నీటితో చెరువులు నింపి రైతుల సాగు, తాగునీటి అవసరాలు తీర్చుతామని హామీ ఇచ్చారు. నాయకులు విభేదాలు పక్కనపెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఇవాళ సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.