కడప జిల్లాలో రాత్రిపూట వాహన తనిఖీలు, నాకాబందీ ముమ్మరం చేయాలని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశించారు. శుక్రవారం ఆయన పోలీసు అధికారులతో సమీక్ష జరిపారు. రాత్రి 10:30లోగా షాపులు, 10 గంటలకు మద్యం దుకాణాలు మూసివేయాలన్నారు. గంజాయి, బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపాలని తెలిపారు. రాత్రిళ్లు రోడ్లపై తిరిగే ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.