ప్రకాశం: దర్శి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంప్ను కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని తెలిపారు. ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం అభినందనీయమని అన్నారు.