VSP: సింహాచలం పంచగ్రామాల భూ సమస్యపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అసెంబ్లీలో మాట్లాడారు. మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. 12,149 కట్టడాల క్రమబద్ధీకరణ ద్వారా వేలాది కుటుంబాలకు ఊరట కల్పించాలని విజ్ఞప్తి చేశారు.