ATP: అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి చెందిన సంగా తేజస్విని టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ వాల్మీకి సామాజికవర్గానికి చెందిన ఈమె గతంలో తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశారు. టీడీపీ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు.