WGL: శిఖర స్కిల్ సెంటర్లో టైలరింగ్, బ్యూటీషన్, మగ్గం విభాగాల్లో శిక్షణ పొందిన 260 మందికి కేయూ వీసీ ప్రతాపరెడ్డి, నీలిమ హాస్పిటల్స్ చైర్మన్ నీలిమరెడ్డి, ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ రాకేష్ రెడ్డి సర్టిఫికెట్లను అందజేశారు. ఒక ఇంట్లో ఒక మహిళ సాధికారత సాధిస్తే మొత్తం ఆ కుటుంబమే వృద్ధిలోకి వస్తుందని, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని రాకేష్ రెడ్డి అన్నారు.