TPT: జిల్లాలో SP సుబ్బారాయుడు ఆదేశాల మేరకు SV డిఫెన్స్ కాలేజీ, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు సైబర్ మోసాలు, మహిళా భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ DSP శ్రీలత, CI తమీమ్ అహ్మద్ పాల్గొన్నారు. సోషల్ మీడియా దుర్వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సమయాల్లో పోలీసుల సహాయం తీసుకోవాలని సూచించారు.