తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. మూడు నెలలకు మొత్తం రూ. 4,25,258 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో ఆర్. లక్ష్మీబాయి, ఛైర్మన్ బద్దిరెడ్డి అచ్చన్నదొర, ధర్మకర్తల మండలి సభ్యులు, బ్యాంక్ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.