కడప రైల్వే స్టేషన్ సమీపంలో నిన్న రైలు కిందపడి చిన్న నరసింహులు (75) మృతి చెందినట్లు కడప రైల్వే SI సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈయన కడప నగరంలోని ఎర్రముక్కపల్లె నివాసి అని అన్నారు. అలాగే భాకరాపేట సమీపంలో రైలు కిందపడి అశోక్ రెడ్డి అనే వ్యక్తి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయన అట్లూరు మండల వాసి అని, వీరిద్దరి మృతిపై వివరాలు తెలియాల్సి ఉంది.