KKD: మండిపోతున్న ఎండలవేళ ప్రజలకు ఊరటనిచ్చేందుకు నగరంలోని 16 ప్రధాన కేంద్రాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఇవాల్టి నుంచి అన్ని చలివేంద్రాలు పని చేస్తాయన్నారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.