AKP: నర్సీపట్నం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్మికులు ధర్నా నిర్వహించారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, వేసవి సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 1810 మినీ వర్కర్స్, 136 సూపర్వైజర్ ప్రమోషన్లు వెంటనే అమలు చేయాలని, ఆయాల ప్రమోషన్ సమస్యలు పరిష్కరించాలన్నారు.