TPT: ఏర్పేడు మండలంలో రెండున్నరేళ్ల బాలికను హత్య చేసి పూడ్చిపెట్టిన ఘటనపై తిరుపతి ఈస్ట్ పోలీసులు తమకు సమాచారం ఇచ్చారని తహసీల్దార్ భార్గవి తెలిపారు. పోలీసుల అభ్యర్థన మేరకు రెవెన్యూ అధికారులతో కలిసి నిందితుడు చూపించిన స్థలానికి వెళ్లి తవ్వకాలు చేశామన్నారు. బాలిక మృతదేహం బయటపడిందని.. మెడికల్ అధికారుల సమక్షంలో పంచానామా పూర్తి చేశామని తెలిపారు.