ASR: జీకేవీధి మండలం నిమ్మలపాలెం జాతీయ రహదారిపై బుధవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రమాదంలో పెదవలస గ్రామానికి చెందిన దేశగిరి కిషోర్ కుమార్, మరో గ్రామానికి చెందిన చిలకల అబ్రహం చనిపోయినట్లు స్థానికులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చింతపల్లిలో తరలించారు.