SKLM: నేర బాధితులు, జైలులో ఉన్న వ్యక్తులపై ఆధారపడిన కుటుంబాలకు సామాజికంగా, ఆర్థికంగా అండగా నిలవడమే ‘నల్సా స్పృహ-2025’ పథకం లక్ష్యమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు అన్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక న్యాయ సేవా సదన్లో న్యాయవాదుల సమావేశం నిర్వహించారు. సమాజంలో అపవాదు ఎదుర్కొంటున్న ప్రభావిత వర్గాలకు ఈ పథకంతో బహుముఖ మద్దతు లభిస్తుందన్నారు.