TPT: బడుగు బలహీన వర్గాల దార్శనికుడు మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు తిరుపతిలోని బాలాజీ కాలనీలో ఘనంగా జరిగాయి. బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఫూలే విగ్రహానికి నివాళులర్పించారు. సమాజంలో అణగారిన వర్గాల కోసం, మహిళా విద్య కోసం ఆయన చేసిన పోరాటం దేశానికే మార్గదర్శకమని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ పునరంకితం కావాలని కోరారు.