తిరుపతి: టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 16న తిరుపతి మహతి కళాక్షేత్రంలో విశేష ధార్మిక ప్రవచనం నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యార్థుల నైతిక విలువలు& ధార్మిక సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు “నిత్య జీవితంలో ధర్మాచరణం” అనే అంశంపై ప్రవచనం ఇవ్వనున్నారు.