W.G: మహిళలు గర్భస్థ దశ నుంచే పోషక ఆహారం తీసుకోవాలని మాధవరం పీహెచ్సీ డాక్టర్ సింధు సూచించారు. శనివారం తాడేపల్లిగూడెం(M) మెట్ట ఉప్పరగూడెం అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. ఆటపాటలతో కూడిన విద్య అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తారన్నారు. చిన్నారులకు త్వరితగతిన విషయాలు అర్థమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్, అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.