CTR: పూతలపట్టు(M)ముతిరేవుల సమీపంలోని SVECలో ఇవాళ హ్యాక్థాన్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా. మోహన్ బాబు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 900 మందికి పైగా విద్యార్థులు తమ ప్రతిభను చాటుకోనున్నట్లు పేర్కొన్నారు. ఉత్తమ ప్రతిభను కనపరచిన వారికి రూ.1.75 లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరుకానున్నారు.