BPT: అద్దంకి మండలం సింగరకొండలో శనివారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. తిరునాళ్ల సందర్భంగా ఆయన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, పూజారులు మంత్రికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని ఆదేశించారు.